యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్కుమార్ దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న యూత్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా..’. యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం నుంచి ‘కలలు చూసినా కన్నులే’ లిరికిల్ సాంగ్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘కలలు చూసినా కన్నులే నేడు మోసెనే కన్నీల్లే… హాయి పంచినా గుండెకే ఓ గాయమయ్యెనే.. ఓహో జంట నడిచినా అడుగులే ఒంటరయ్యనే ఇవ్వాలే.. వెలుగు నిచ్చినా నీడకే మిగిలింది చీకటే..’ అంటూ అర్థవంతంగా మనసుకు హత్తుకునే ఈ విరహగీతాన్ని కాసర్ల శ్యామ్ రాయగా లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ అంతే అద్భుతంగా ఆలపించారు. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మ్యాజికల్ ట్యూన్స్ పాటను మరో రేంజ్కి తీసుకెళ్లాయి. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్తో దూసుకెళుతోంది. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదలవుతున్నాయి.
next post