సినిమా, టీవీ పరిశ్రమలోని ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఆయన చిత్రం ‘నగ్నం’లో నటించిన శ్రీ రాపాక కూడా పాల్గొన్నారు. ‘మన సైతం’ వ్యవస్థాపకుడు, నటుడు కాదాంబరి కిరణ్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించిన శ్రీ.. హైదరాబాద్లోని ఒక పార్కులో మూడు మొక్కలు నాటారు. ఇంత మంచి కార్యక్రమంలో తనను కూడా భాగం చేసినందుకు నటుడు కాదాంబరి కిరణ్కు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్కు శ్రీ థ్యాంక్స్ చెప్పారు. అలాగే తాను మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ను విసిరారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ తేజ, నిర్మాత దామోదర ప్రసాద్లను ఈ ఛాలెంజ్కు నామినేట్ చేశారు. ఈ ముగ్గురు మూడు మొక్కలు చొప్పున నాటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మరి స్వీటీ ఛాలెంజ్కు వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా, ఆర్జీవీ ‘నగ్నం’ సినిమాతో శ్రీ రాపాక ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Sri rapaka (sweety)accepted #GreenindiaChallenge 🍃
from @manamsaitham artist Planted 3 saplings. Further she nominated @RGVzoomin #tejadirector #damodarprasadproducer to plant 3 trees & continue the chain.
Thanked Shri @MPsantoshtrs for this intiative. #HarithaHaaram pic.twitter.com/tnJz00N97J— Vamsi Shekar (@UrsVamsiShekar) July 17, 2020