భారత బౌలర్లు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో చెలరేగుతున్నారు. ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పర్యాటక జట్టును మరోసారి దెబ్బతీశారు. భోజన విరామం తర్వాత 45 ఓవర్లకు సఫారీల జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది.
డీన్ఎల్గర్(48; 72 బంతుల్లో 8×4), తెంబ బవుమా(38; 63 బంతుల్లో 4×4, 1×6) మినహా మిగతా బ్యాట్స్మెన్ అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్ ఇంకో మూడు వికెట్లు పడగొడితే మూడు టెస్టుల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంటుంది. రెండో ఇన్నింగ్స్లో అశ్విన్, జడేజా రెండేసి వికెట్లు తీయగా ఉమేశ్, షమి, ఇషాంత్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం ఫిలాండర్, కేశవ్ క్రీజులో ఉన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన.. వైసీపీ సర్కార్ పై గోరంట్ల ఫైర్