telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రంలో రాక్షస పాలన.. వైసీపీ సర్కార్ పై గోరంట్ల ఫైర్

gorantla buchayya on resignation

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నియంత, రాక్షస పాలన కొనసాగుతుందని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు, టీడీపీ నేతలపై సోషల్‌ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతున్నారని మండిపడ్డారు.

టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తప్పుబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం పోలీస్‌ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందని గోరంట్ల మండిపడ్డారు.

Related posts