telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అంగీ చింపుకుని..మనమే చింపామని గొడవ చేస్తారు

harish rao trs

బీజేపీ పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. స్వంత పార్టీ కార్యకర్తలను, వారికి ఇచ్చిన హమీలను నిలబెట్టుకోని బీజేపీ రేపు ప్రజలకు ఇచ్చిన మాట ఎలా నిలబెడతాడని అన్నారు. బీేజేపీ ఓటమిని గ్రహించి ఆ నేతలు ఫస్ట్రేషన్ లో ఉన్నారని..అందుకే వారు డబ్బులు నమ్ముకున్నారని పేర్కొన్నారు. మొన్న హైదరాబాద్ వద్ద దుబ్బాక కు డబ్బులు తెస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందేనని..సిద్దిపేటలో ఆభ్యర్థి ఇంట్లో డబ్బులు దొరికితే పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికితే ఆ డబ్బులను గుండాల్లా బీజేపీ కార్యకర్తలు గుంజుకుపోయారని మండిపడ్డారు.
తప్పుు చేయకపోతే పోలీసులకు సహకరించాలని..ఇవాళ సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్ ఇంటిలో పోలీసులు సోదాలు జరిపారన్నారు. నా కారును, మా అభ్యర్థి కారును ఆపి సోదాలు చేశారని.. ఆపినా చోటల్లా మేం సహకరించామని గుర్తు చేశారు. వెనకటికి దొంగ దొరికాక తానే దొంగ దొంగ అని అరిచారట… ఇవాళ సిద్దిపేటలో బీజేపీ కార్యకర్తలు ఇదే చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పంచడానికి డబ్బులు తెస్తారని.. పోలీసుల సోదాలో దొరికితే మీరే దొంగ దొంగ అని అరుస్తారని ఫైర్ అయ్యారు. ప్రజలకు మీ గురించి తెలుసునని..ఓటమి ఫస్ట్రేషన్లో బీజేపీ గొడవలు సృష్టిస్తున్నారు కార్యకర్తలు సంయమనంతో ఉండండి అని సూచించారు. అంగీ చింపుకుని..మనమే చింపామని గొడవ చేస్తారని.. జాగ్రత్తగా ఉండండి అని పేర్కొన్నారు.

Related posts