telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో తగ్గని కరోనా..24 గంటల్లో

Covid-19

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఎంత మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,905 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 817679కి చేరింది. ఇందులో 26268 కేసులు యాక్టివ్ గా ఉంటే,784752 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 16 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6,659 కు చేరింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లాల వారీగా తీసుకుంటే అనంతపురంలో 221, చిత్తూరులో 259, తూర్పుగోదావరి జిల్లాలో 414, గుంటూరులో 359, కడపలో 191, కృష్ణాలో 361, కర్నూలులో 25, నెల్లూరులో 96, ప్రకాశంలో 206, శ్రీ కాకుళంలో 90, విశాఖపట్నంలో 119, విజయనగరంలో 70, పశ్చిమ గోదావరిలో 494 కేసులు నమోదయ్యాయి.

Related posts