దేశ వ్యాప్తంగా ప్రజలు రక్షా బంధన్ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. సోదర, సోదరీ మణుల ప్రేమకు చిహ్నమైన ఈ రాఖీ పండుగను అంతే ప్రేమతో జరుపుకుంటున్నారు. ఈ పర్వదినం రోజున.. ప్రతీ సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి వారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుతారు.
అలాగే.. ప్రతీ సోదరుడు తన సోదరికి జీవితాంతం రక్షణగా ఉంటానని భరోసా ఇస్తారు హిందూ పండగల్లో రాఖీ పౌర్ణమి ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. రాఖీ రోజు ఉదయాన్నే తలార స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకుని రాఖీకి సిద్ధపడతారు. అక్కచెల్లెళ్లంతా బుద్ధిగా కూర్చున్న అన్నదమ్ములకి రాఖీని కడతారు.
చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అది చాలా ఉత్సాహంతో జరుపుకుంటూరు. ఈ పండగను శ్రావణ పూర్ణిమ అని కూడా అంటారు.
ఈ ఏడాది ఆగస్టు 22న రాఖీ వచ్చింది. ఈ రోజు ఉదయం 6.19 గంటల నుంచి సాయంత్రం 5.31 గంటల వరకు రాఖీ కడితే మంచిదని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. రాఖీ కట్టినందుకు ప్రతిఫలంగా అక్కాచెల్లెళ్లకు సోదరులు బహుమతులు ఇచ్చి గౌరవిస్తారు.
అంతేకాదు ఇతిహాసాల ప్రకారం.. ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు.
అలాగే.. మన దేశాన్ని కపాడుతూ ప్రజలందరూ రక్షణ ఇస్తున్నందుకు పోలీసులకు కాలేజ్ అమ్మాయిలు ఈ రోజు రాఖీ కడతారు.
బీజేపీకి టీఆర్ఎస్ చాలాసార్లు మద్దతు: ఉత్తమ్