telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

Road accident 8 dead and 30 injured

గ్వాలియర్ సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం తొమ్మిది మందితో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారులోని ప్రయాణికులంతా రాజస్థాన్ కి చెందిన వారుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts