వినియోగదారుల కోసం ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ ప్రకటించింది. భారత్ లో జియో రంగప్రవేశంతో డేటా వినియోగం భారీగా పెరిగింది. దాంతో ఇతర మొబైల్ సేవల ఆపరేటర్లు కూడా డేటా ప్లాన్లు సవరించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా డేటా ప్లాన్ వెలువరించింది. దీని ధర రూ.689 కాగా, 200 జీబీ డేటా ఆఫర్ చేస్తున్నారు.ఈ ప్లాన్ కాలపరిమితి 180 రోజులు మాత్రమే. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. ఇందులో వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ సేవలు ఉండవు.