telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జమ్మూలో .. గ్రేనేడ్ దాడి.. 18మందికి తీవ్రగాయాలు..

granade attack in jammu bus stand 18 injured

ఉగ్రమూకలు తమ చర్యలను నిలుపుచేయడం లేదు. తాజాగా, జమ్ములోని బస్టాండ్‌లో భారీ పేలుడు సంభవించింది. బస్సు కింద అమర్చిన గ్రేనేడ్‌ పేలిన ఘటనలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

పుల్వామా దాడి ఘటన మరువక ముందే ఈ సంఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్టాండ్‌ను తమ అదుపులోకి తీసుకుని విస్తృత తనిఖీలు చేపట్టారు.

పుల్వామా ఘటనను ప్రస్తుత ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటున్నది అనడానికి ఈ తాజా దాడి నిదర్శనం. అంతమంది జవానులు మరణించినా ప్రభుత్వం సరైన సైనిక చర్య తీసుకోలేక, ఇంకా ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోకుండా.. రాజకీయాలు చేస్తుంది. దీనితో మరో దాడికి దిగారు ఉగ్రమూకలు. ప్రభుత్వం దేశభక్తిని కూడా రాజకీయాలకు వాడుకున్నంత కాలం ఇలా సరిహద్దులో శవాల గుట్టలు పౌరులు చూడక తప్పదేమో..!

Related posts