telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ప్రొ కబడ్డీ : .. అగ్రస్థానంలో బెంగాల్.. తెలుగు వారికి మళ్ళీ ఓటమే ..

telugu titans lost on bengal in pro kabaddi

బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఒక్క పాయింట్‌ తేడాతో తెలుగు టైటాన్స్‌ మరో ఓటమిని చవి చూసింది. హోరా హోరీగా సాగిన ఈ పోరు లో చివరి రైడ్‌ వరకూ తెలుగు టైటాన్స్‌ పోరాడినా ఫలితం లేకపోవడంతో 39-40తో బెంగాల్‌ చేతిలో పరాజ యాన్ని చవిచూసింది. రైడ్‌లలో టైటాన్స్‌ రాణించినా.. బెంగాల్‌ నాలుగుసార్లు టైటాన్‌ను ఆలౌట్‌ చేయడం ఆ జట్టు గెలుపుకు బాటలు వేసింది. టైటాన్స్‌ రైడర్‌ సిద్ధార్ద్‌ దేశారు(15), రజ్‌నీష్‌ దలాల్‌(6) రాణించగా… ట్యాకిల్స్‌లో అబోజర్‌(5), భరద్వాజ్‌(1) నిరాశపరి చారు. ఇక బెంగాల్‌ రైడర్‌ మణిందర్‌ సింగ్‌(17) సత్తా చాటగా.. బల్‌దేవ్‌(3), రింకు నర్వాల్‌(3) ట్యాకిల్స్‌లో ఫర్వాలేదనిపించారు.

ఈ విజయంతో బెంగాల్‌ జట్టు 19 మ్యాచుల్లో 12 విజయాలు 4 పరాజయాలు, 3 డ్రాలతోపాటు 93 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ ప్యాంథర్స్‌ జట్టు 43-34తో పుణెరి పల్టన్స్‌ను చిత్తుచేసింది. జైపూర్‌ రైడ్‌లద్వారా 29, ట్యాకిల్స్‌ ద్వారా 10 పాయింట్లను సాధించడంతోపాటు నాలుగుసార్లు పుణెరిని ఆలౌట్‌ కూడా చేయగల్గింది. గురువారం పట్నా పైరెట్స్‌-దబాంగ్‌ ఢిల్లీ జట్ల మ్యాచ్‌ జరగనుంది.

Related posts