ఏపీ సీఎం జగన్పై అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. బాబాయి హత్యపై జాలి చూపని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడనేది భ్రమ అని పేర్కొన్నారు. గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సీఎం జగన్కు కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. దిగజారుడు రాజకీయాలు చేయడం జగన్కి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఏ మతాన్నీ ప్రశాంతంగా ఉండనిచ్చే వ్యక్తిత్వం జగన్కు లేదని.. అందుకే క్రిష్టియన్లకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్, హిందువులకు సంక్రాంతి కానుకలు దూరం చేశారని నిప్పులు చెరిగారు. ఓ వైపు రథాలు తగలబెట్టి, విగ్రహాలను ధ్వంసం చేయించి మరో వైపు పూజల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ మతంపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారో చెప్పాలని ఫైర్ అయ్యారు అచ్చెన్నాయుడు. మతాల మధ్య చిచ్చు పెట్టే వైసీపీ ప్రభుత్వానికి స్వస్తి చేప్పాలని సూచించారు. మొదటి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వానికి సూచించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఫైర్ అయ్యారు అచ్చెన్నాయుడు.
previous post
next post