telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీ ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ విరాళం

ఏపీలో కరోనా వైరస్ పై పోరుకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమవంతు సాయాన్ని అందిస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పై చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తమ వంతు సాయమందించింది.

ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లోని సభ్యులు తమ మూడు రోజుల వేతనాన్ని కోవిడ్-19 సహాయచర్యల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఈ విషయాన్ని జగన్ కు తెలియజేస్తూ సంబంధిత పత్రాన్ని ఆయనకు అందజేశారు.

Related posts