ఏపీ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో హైకోర్టు సూచన మేరకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశమై వినతి పత్రం అందజేశారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేశ్ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ పంపారు.
ప్రజా సమస్యలపై పోరాడుతా : పవన్