దిల్లీలోని బార్ స్క్వేర్ శ్మశానవాటికలో.. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా అంత్యక్రియలు సైనిక లాంఛనాలు, బంధుమిత్రల అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబసభ్యులు, ప్రజలు రావత్ దంపతులకు కన్నీటి వీడ్కోలు పలికారు.
బపిన్ రావత్, ఆయన భార్య మధులిక భౌతికకాయాలకు ఒకే చితిపై తుది వీడ్కోలు పలికారు. ఇద్దరు కుమార్తెలు , కృతిక, తారిణి కలిసి వారికి అంత్య క్రియలు నిర్వహించారు. కూతుళ్లు కృతిక , తరుణి చితికి నిప్పంటించారు.జీవిత ప్రయాణంలాగే, జనరల్ రావత్ చివరి ప్రయాణం కూడా అపూర్వమైనది. ఆయనతో కలిసి ఏడడుగులు నడిచిన సతీమణి ఆయన తోడుగానే వెళ్ళిపోయారు.
రావత్కు గౌరవసూచికగా.. 17 తుపాకులతో వందనం చేసింది సైన్యం. కుటుంబసభ్యులు, దాదాపు 800మంది మిలిటరీ సిబ్బంది.. రావత్ దంపతులకు తుది వీడ్కోలు పలికారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ , త్రివిధదళాధిపతులు , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు పలువురు ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
దేశ రక్షణ కోసం జీవితాన్ని అర్పించి, సైన్యంలో సుదీర్ఘ సేవలందించిన భారత తొలి త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ నివాసం నుంచి బ్రార్ స్క్వేర్ స్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. భారత్మాతాకీ జై అంటూ ప్రజలు ఆయనకు నివాళి అర్పించారు.
.