టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఆయన చేరికకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. మరోవైపు గంటా రానుండటంతో విశాఖ వైసీపీలో ముసలం పుట్టింది. గంటా రాకను స్థానిక వైసీపీ ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మంత్రి అవంతి శ్రీనివాస్ గంటాపై బహిరంగ విమర్శలు చేశారు.
మరోవైపు, భీమిలి నియోజక వర్గంలో గంటాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. గంటా మాకొద్దు అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వైయస్సార్ విగ్రహాన్ని గంటా తొలగించారని అన్నారు. ఇప్పుడు ఆయన పార్టీలోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. గంటాను పార్టీలోకి తీసుకోవద్దని జగన్ ను కోరుతున్నారు.