వలస కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు సీఎం జగన్ కు మరోసారి లేఖ రాశారు. వలస కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదని తెలిపారు.
ఈ నెల 6న రాసిన లేఖలో వలస కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరినా ఫలితం లేదని ఆరోపించారు.రాష్ట్రంలోని రోడ్లపై కాలినడకన మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సైకిళ్లపై వెళుతున్న వలస కార్మికులు ఎక్కడ కనిపించినా బస్సుల ద్వారా రాష్ట్ర సరిహద్దుల వద్దకు చేర్చాలని సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.