ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రగొండపాలెం మండలం కొత్తపల్లి రహదారిపై ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. 10 మంది గాయాల పాలయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులందరినీ స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులు పొట్లపాటి శివమ్మ(35), గొంగటి మార్తమ్మ(45), ఇత్తడి లింగమ్మ(50), కారు డ్రైవర్ వెంకటేశ్వరరెడ్డిగా గుర్తించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.వారంతా మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు పోలీసులు.
ఎర్రగొండపాలెంకు చెందిన కూలీలు మిర్చి కోతకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో… కొత్తపల్లి వద్ద ఎదురుగా వస్తున్న కారును ఆటో ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.