telugu navyamedia
క్రీడలు వార్తలు

కరోనాతో భారత మాజీ ఆటగాడు మృతి…

కరోనా కారణంగా సౌరాష్ట్రా మాజీ క్రికెటర్, కోచ్, బీసీసీఐ మాజీ రిఫరీ రాజేంద్రసిన్హ్ జడేజా కోవిడ్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్​ ధ్రువీకరించింది. ‘సౌరాష్ట్ర క్రికెటర్లలో ఒకరైన రాజేంద్ర సిన్హ్​ జడేజా కరోనా​తో కన్నుమూశారు. పాత తరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న జడేజా లేని లోటు తీరనిది. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాం” అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పాత తరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్​రౌండర్ జడేజా. 50 ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​ల్లో 134 వికెట్లతో పాటు 1536 రన్స్ సాధించారు. 11 లిస్ట్​-ఏ మ్యాచ్​ల్లో 104 పరుగులతో పాటు 14 వికెట్లు పడగొట్టారు. బీసీసీఐ అధికారిక రిఫరీగా పనిచేశారు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్​లో కోచ్​, టీమ్​ మేనేజర్​, సెలెక్టర్​గా పనిచేశారు. జడేజా మృతి పట్ల బీసీసీఐ, సౌరాష్ట్ర మాజీ కార్యదర్శి నిరంజన్​ షా కూడా సంతాపం ప్రకటించారు.’మంచి క్రికెట్ నైపుణ్యాలున్న ఆటగాడు జడేజా. ఆట పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని పేర్కొన్నారు.

Related posts