బీజేపీ ఫిర్యాదు మేరకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూలై 23న కరీంనగర్ లో జరిగిన ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ పట్టణ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఎంఐఎం నేత ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదంటూ పేర్కొనడంతో బిజీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది.