జమ్ముకశ్మీర్లో ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు తమకు లంచం ఇవ్వజూపారంటూ కొందరు జర్నలిస్టులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో ఒకటి కూడా బయటికొచ్చింది. ఆ కేసులో ఇవాళ పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జమ్మూకశ్మీర్ బీజేపీ యూనిట్ చీఫ్ రవీందర్ రైనాతో పాటు మరో నేతపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మే 2వ తేదీన జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా బీజేపీ నేతలు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జర్నలిస్టులపై కేసు నమోదు చేయాలని లేహ్కు చెందిన చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు.
previous post
next post