ఈ అమానుష ఘటన ఇండియానాలోని బ్లూమింగ్టన్లో చోటుచేసుకుంది. సర్కస్లో పనిచేసే బాలుడి తండ్రి లూయిస్ పొస్సొ, సవతి తల్లి డయాన్ ఫ్లోర్స్ ఇండియానా ఆసుపత్రికి చలనంలేని కొడుకుతో వచ్చారు. తమ కుమారుడు ఉన్నట్టుండి స్పృహ తప్పిపడిపోయాడని ఏమైందో తెలియదంటూ వైద్యుల వద్ద బుకాయించారు. అప్పటికే బాలుడు విగతజీవిగా పడి ఉండడం, శరీరంపై గాయాలు కనిపించడంతో వైద్యులకు అనుమానం వచ్చింది. శవపరీక్ష అనంతరం బాలుడు చాలా రోజులుగా ఆహారం లేకపోవడంతో తీవ్రమైన ఆకలితో అలమటించి చనిపోయినట్లు నిర్ధారించారు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు వైద్యులు. వారి సమాచారం మేరకు ఆసుపత్రికి చేరుకున్న తండ్రి సెల్ఫోన్లో బాలుడు ఏడౌర్డొ కాళ్లు, చేతులు తాడుతో కట్టేసి బాత్టబ్లో పడేసిన వీడియోను పోలీసులు గుర్తించారు. దీంతో లూయిస్ దంపతులను మన్రో కౌంటీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా బాలుడికి చాలా రోజులుగా ఆహారం ఇవ్వడం లేదని, ఆపై శారీరకంగా హించినట్లు అంగీకరించారు. దాంతో పోలీసులు లూయిస్, ఫ్లోర్స్పై హత్య నేరం కింద కేసు నమోదు చేశారు.