సీబీఐని కక్షసాధింపు కోసం వాడుతున్నారని ఆరోపిస్తూ సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను రద్దుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.
సీబీఐ రాష్ట్రంలో కేసులను విచారించేందుకు సమ్మతి ఉత్తర్వులను జారీచేసింది. 2018, నవంబర్ 8న సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఏపీలో పలు కేసులను సీబీఐ విచారించేందుకు మార్గం సుగమమయింది.