నాన్వెజ్ ఓ కుంటుంబంలో విషాదాన్ని మిగిల్చింది..కొన్ని సార్లు కుంటుంబాల్లో చిన్న చిన్న సమస్యలే తీరని ఆవేదాన్ని మిగిలిస్తుంటాయి. అలాంటి ఘటనే ఛత్తీస్గఢ్ సూరజ్పుర్లో జరిగింది.
శ్రావణమాసం అంటే మహిళలంతా వ్రతాలు, నోములు ఆచరించే మాసం.. అందులోనూ ఆడవాళ్ళు నాన్వెజ్ తినకుండా భక్తితో పూజలు చేస్తారు. శ్రావణ పూర్ణిమ రోజున తన భర్త చికెన్ తిన్నాడని ఓ మహిళ ఆగ్రహానికి గురై, కోపం తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
కరౌదా గ్రామానికి చెందిన రామ్ జనమ్ సింహ్ అనే వ్యక్తి ఆగస్టు 22న రక్షాబంధన్ సందర్భంగా తన బంధువులతో కలిసి చికెన్ తిన్నాడు. శ్రావణ మాసంలో చాలా మంది మాంసం తినడం ఆపేస్తారు. కానీ రామ్ జనమ్ చికెన్ తినడం చూసి తన భార్య తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వెంటనే ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.
ఈ పరిణామాన్ని ఊహించని రామ్ జనమ్ సింహ్.. తన భార్యను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే తన భార్య శరీరం చాలా మేరకు కాలిపోయింది. వెంటనే తనను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అంబికాపుర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.