telugu navyamedia
క్రైమ్ వార్తలు

భర్త చికెన్ తిన్నాడని.. భార్య సూసైడ్

నాన్‌వెజ్‌ ఓ కుంటుంబంలో విషాదాన్ని మిగిల్చింది..కొన్ని సార్లు కుంటుంబాల్లో చిన్న చిన్న స‌మ‌స్య‌లే తీర‌ని ఆవేదాన్ని మిగిలిస్తుంటాయి. అలాంటి ఘటనే ఛత్తీస్​గఢ్ సూరజ్​పుర్​లో జరిగింది.

శ్రావణమాసం అంటే మహిళలంతా వ్రతాలు, నోములు ఆచరించే మాసం.. అందులోనూ ఆడ‌వాళ్ళు నాన్‌వెజ్ తిన‌కుండా భ‌క్తితో పూజ‌లు చేస్తారు. శ్రావణ పూర్ణిమ రోజున తన భర్త చికెన్​ తిన్నాడని ఓ మహిళ ఆగ్రహానికి గురై, కోపం తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుంది.

Ukrainian chicken export forecast revised | Ukrhalal

కరౌదా గ్రామానికి చెందిన రామ్​ జనమ్​ సింహ్ అనే వ్యక్తి ఆగస్టు 22న రక్షాబంధన్​ సందర్భంగా తన బంధువులతో కలిసి చికెన్​ తిన్నాడు. శ్రావణ మాసంలో చాలా మంది మాంసం తినడం ఆపేస్తారు. కానీ రామ్​ జనమ్​ చికెన్​ తినడం చూసి తన భార్య తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వెంటనే ఇంట్లో ఉన్న కిరోసిన్​ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.

ఈ పరిణామాన్ని ఊహించని రామ్​ జనమ్​ సింహ్.. తన భార్యను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే తన భార్య శరీరం చాలా మేరకు కాలిపోయింది. వెంటనే తనను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అంబికాపుర్​ మెడికల్​ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

Related posts