telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

డొక్కాకు వైసీపీ ఎమ్మెల్సీ టికెట్..!

Dokka manikvaraprasad

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ఆ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి జరగనున్న ఉప ఎన్నికలకు వైసీపీ అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ ఖరారు చేసింది. నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధికారికంగా మాత్రం డొక్కా పేరును వైసీపీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. 

డొక్కాను పతిపాదిస్తూ పదిమంది ఎమ్మెల్యేల సంతకాలతో నేరుగా నామినేషన్ వేయించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష టీడీపీ నుంచి బరిలో ఎవరూ లేకపోవడంతో డొక్కా గెలుపు ఏకగ్రీవం కానుంది. నేటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది.

Related posts