telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గుంటూరు ఎంపీ టికెట్ ఖరారు చేసిన చంద్రబాబు

Chandrababu comments Jagan cases

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఏపీ సీఎం చంద్రబాబు ఎంపిక చేస్తున్నారు. తాజాగా గుంటూరు పార్లమెంట్‌పై ఆదివారం సమీక్ష జరిపారు. అనంతరం గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పేరును ఖరారు చేశారు. పొన్నూరు శాసనసభ స్థానం నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి నుంచి ఆలపాటి రాజా పేర్లను ప్రకటించారు.

గుంటూరు తూర్పు- ముస్లిం మైనార్టీలకు, గుంటూరు పశ్చిమ- మద్దాల గిరి, ఎస్సీ, రెడ్డి వర్గాల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాడికొండ- బాపట్ల ఎంపీకి మాల్యాద్రి, శ్రవణ్‌కుమార్‌, డొక్కా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సాయంత్రానికి మరికొంతమంది అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది.

Related posts