ప్రముఖ దర్శకుడు..పి చంద్ర శేఖర్ రెడ్డి ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నై లోమృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు , ఆయన భార్య చాలా సంవత్సరాల క్రితమే మరణించారు . ఆయనకు ఇద్దరు కుమార్తెలు…
చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్యం సంవత్సర కాలం నుంచి బాగాలేదు. జనవరి 3వ తేదీన ఉదయం 8. 30 గంటలకు తుది శ్వాశ విడిచారు . ఆయన వయసు 86 సంవత్సరాలు.
చంద్రశేఖర్ రెడ్డి సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూపర్స్టార్ కృష్ణ నటించిన ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్బాబులాంటి నాటి ప్రముఖ హీరోలు లతో పని చేశారు.
చంద్ర శేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాల్లో ..
భలే అల్లుడు, మానవుడు దానవుడు ,కొడుకులు, బడి పంతులు, విచిత్ర దాంపత్యం , రగిలే గుండెలు, నవోదయం , బంగారు కాపురం , రాజకీయ చదరంగం, అన్నా వదిన, పెద్దలు మారాలి. ఇల్లు ఇల్లాలు , కొత్త కాపురం, గౌరీ , అత్తగారు జిందాబాద్ , బంగారు భూమి ,తల్లీ కొడుకులు మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.
నెల్లూరు నుంచి సినిమా రంగానికి వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి మొదట దర్శకుడు వి .మధుసూదన రావు దగ్గర చేరి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు . చంద్ర శేఖర్ రెడ్డి గారికి గ్రామాలంటే ఎంతో ఇష్టం . గ్రామీణ నేపథ్యంలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు .
ఆయన దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలు వున్నాయి . 2016లో చంద్ర శేఖర్ రెడ్డి 64వ జాతీయ సినిమా అవార్డుల కమిటీలో సభ్యుడుగా పనిచేశారు..చంద్రశేఖర్ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు .