telugu navyamedia
సినిమా వార్తలు

ధనుష్ నిర్మాణ సంస్థ మూసివేత… స్పందించిన హీరో

Dhanush'

కోలీవుడ్ స్టార్ హీరో హీరో ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వండ‌ర్‌బార్స్‌ను మూసివేస్తార‌ని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి. తాజాగా ఈ వార్త‌ల‌పై ధనుష్ స్పందిస్తూ నిర్మాణ సంస్థను మూసివేయడం లేదని, త్వరలోనే రజినీకాంత్ సర్ తో తన నిర్మాణ సంస్థలో సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ “ఏ సంస్థ‌కు అయినా జ‌యాప‌జ‌యాలుంటాయి. మా బ్యాన‌ర్‌లో రూపొందిన చిత్రాలన్నీ మంచి ఫ‌లితాల‌నే రాబ‌ట్టాయి. న‌టుడిగా ఏడాదికి రెండు సినిమాల్లో న‌టిస్తున్నాను. అలాగ‌ని నిర్మాణానికి దూర‌మ‌య్యాన‌ని అనుకుంటే ఎలా. మంచి స్క్రిప్ట్ కుద‌ర‌గానే ర‌జ‌నీ సార్‌!ను త‌ప్ప‌కుండా సంప్ర‌దిస్తాం. ఆయ‌న‌తో మా బ్యాన‌ర్‌లో సినిమా చేస్తాం. మా బ్యాన‌ర్‌ను మూసివేయ‌లేదు” అన్నారు. గ‌తంలో ధ‌నుశ్ త‌న బ్యాన‌ర్‌పై ర‌జ‌నీకాంత్‌తో “కాలా” సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.

Related posts