‘తొలిప్రేమ’ పవన్ కల్యాణ్ కెరీర్లోనే ఓ బ్లాక్బస్టర్ చిత్రం. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే, తాజాగా ఈ సినిమాలో నుంచి ‘ఈ మనసే.. సే..సే’ అంటూ సాగే సూపర్హిట్ ప్రేమ పాటను నేటితరం యువతకు దగ్గర చేసే విధంగా ‘మిస్మ్యాచ్’ చిత్రంలో రీమేడ్ చేశారు. ఈ పాటను పవన్ కల్యాణ్ ఆదివారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా కథానాయకుడు ఉదయ్ శంకర్తో పాటు చిత్రబృందానికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పాట విడుదల అనంతరం కథానాయకుడు ఉదయ్ శంకర్ విలేకర్లతో మాట్లాడారు. ‘నా అభిమాన నటుడు పవన్కల్యాణ్ కెరీర్లో ‘తొలిప్రేమ’ ఓ బ్లాక్బస్టర్ చిత్రం. ఆ సినిమాలోని ‘ఈ మనసే’ అంటూ సాగే పాటను మా ‘మిస్మ్యాచ్’ చిత్రంలో రీమేడ్ చేశాం. ఈ పాట మరోసారి ప్రేక్షకులను అలరిస్తుంది. సింగిల్ టేక్లో ఈ పాటను చిత్రీకరించాం’ అని ఉదయ్ తెలిపారు. ‘మిస్మ్యాచ్’ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఆటగదరా శివ ఫేం ఉదయ్ శంకర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మిస్మ్యాచ్’. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కథానాయిక. ‘సలీమ్’ చిత్రాన్ని తెరకెక్కించిన ఎన్వీ నిర్మల్ కుమార్ ‘మిస్మ్యాచ్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 6వ తేదీన సినిమా విడుదల కానుంది.