telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇంకా చాలా విషయాలు బయటకు రాలేదు… మీటూపై హీరోయిన్ అసంతృప్తి

Radhika-Apte

రక్త చరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. కాంట్రవర్శీ కామెంట్లకు కేరాఫ్‌గా నిలిచే ఈ అమ్మడు బాలకృష్ణతో ‘లెజండ్’, ‘లయన్’ సినిమాలలో నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కబాలి సినిమాలలో నటించి దక్షిణదిలో క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్‌లో టాప్ హీరోలతో నటించిన ఈ భామ తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు.. హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. లేటెస్ట్‌గా ‘లిబర్టీ ఏ కాల్ టు స్పై’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది రాధిక. అంతకుముందు ‘ది వెడ్డింగ్ గెస్ట్’తో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈమె. తాజాగా ఈ మరాఠీ నటి మరోమారు ‘మీటూ’ ఉద్యమంపై స్పందించారు. బాలీవుడ్‌ను మీటూ ఉద్యమం ఉప్పెనలా తాకి వెళ్లిపోయిందని, అయినా ఇండస్ట్రీలో మార్పురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీటూ తరువాత ఆనేక మార్పులు వస్తాయిని భావించినా ఏమీ జరగలేదన్నారు. ఇంకా చాలా విషయాలు బయటకు రాలేదని, ఇది ఎంతో నిరాశపరచిందని అన్నారు. అదేవిధంగా సినీ ఇండ్రస్ట్రీలో పురుషులకు, స్త్రీలకు చెల్లించే పారితోషికాల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. సమానత్వం అనేది ఇంకా రాలేదన్నారు. ‘ఏ’ సర్టిఫికెట్ సినిమాలలో నటించే నటీమణులకు… అదే తరహా సినిమాలలో నటించే హీరోలతో సమానమైన పారితోషికం ఇవ్వాల్సివుందన్నారు. ‘ఏ’ సర్టిఫికెట్ సినిమాలో నటించే హీరోలు కోట్ల రూపాయల లబ్ధిపొందుతారని అన్నారు. వారికి అధిక పారితోషికం ఇవ్వాల్సిందే… అయితే వారితో పాటు మిగిలిన నటులు కూడా కష్టపడ్డారనేది గుర్తించాలి” అని అన్నారు.

Related posts