*మోహన్బాబు ఇంటికి పిలిస్తే వెళ్లాను..
*చంద్రబాబు సినీ ఇండస్ట్రీని
*మోహన్బాబుతో కేవలం వ్యక్తిగత భేటి..
*ట్వీట్పై అడిగితే మళ్ళీ మార్చానని విష్ణు చెప్పాడు..
* హైదరాబాద్ లో నటుడు మోహన్ బాబును కలిసిన మంత్రి పేర్ని నాని
సినీ నటుడు మోహన్ బాబు ఆహ్వానం మేరకే తాను ఆయన ఇంటికి వెళ్లానని మంత్రి పేర్నినాని తెలిపారు. 2002 నుంచి మోహన్ బాబు కుటుంబంతో తనకు వ్యక్తిగతమైన అనుబంధం వుందని…మోహన్ బాబు తనను కాఫీకి ఆహ్వానిస్తే వెళ్లానని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెళ్లి చెప్పే పరిస్థితి ఉండదని పేర్ని నాని తెలిపారు.
కొన్ని మీడియాల్లో అలా వార్తలు వచ్చాయని, అవి వాస్తవ విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వం తరుపున ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సినవసరం లేదని అన్నారు. చంద్రబాబు ఓర్వలేకనే టాలీవుడ్ చర్చలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు సినిమా ఇండ్రస్ట్రీకి ఉపయోగపడ్డారా? అని పేర్ని నాని ప్రశ్నించారు.
సినీ ఇండ్రస్ట్రీని ఇబ్బంది పెట్టింది చంద్రబాబు మాత్రమేనని అన్నారు. తనకు నచ్చినవాళ్లని ఒకరకంగా .. నచ్చిన వారిని మరోరకంగా ట్రీట్ చేస్తారని పేర్ని నాని ఆరోపించారు. ఓర్వలేని తనంతో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నించారని అన్నారు. చిరంజీవి సినిమాను ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ఆయన సోదరుడే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారని నాని ఆరోపించారు. చంద్రబాబు ఈర్ష్య, అసూయలతో మాట్లాడుతున్నారన్నారు.
శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం సందర్భంగా హైదరాబాద్ వెళ్లి న పేర్ని నాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లి కలిశారు.
అయితే పేర్ని నాని తమ ఇంటికి రావాడాన్ని తెలుపుతూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తెలుగు సినీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలపై చర్చించడానికి విచ్చేసిన పేర్నినాని కృతజ్ఞతలు అన్నట్లుగా ఆయన ట్విట్ చేశారు. దీంతో నెట్టింట వైరల్గా మారింది.
నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చిరంజీవి బృందం భేటీ వివరాలను, సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై మోహన్బాబుకు మంత్రి పేర్ని నాని వివరించానికి వెళ్లినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పై విదంగా స్పందించారు పేర్నినాని..
మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేయాలి… పీకేపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్