నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడంతో పాటు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 23 పాయింట్లు లాభపడి 39,839కి చేరుకుంది. నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 11,917 వద్ద స్థిరపడింది.
టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.79%), ఐటీసీ (1.08%), ఎల్ అండ్ టీ (0.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.59%), ఏసియన్ పెయింట్స్ (0.53%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.44%), వేదాంత లిమిటెడ్ (-1.32%), ఇన్ఫోసిస్ (-1.14%), యస్ బ్యాంక్ (-1.04%), టాటా మోటార్స్ (-0.82%).