యంగ్ హీరో నితిన్ వివాహానికి సిద్ధమవుతున్నారు. జూలై 26న హైదరాబాద్లో రాత్రి 8:30 గంటలకు షాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. కరోనా విషయం లో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాలవారు, సన్నిహిత స్నేహితులు మాత్రమే హాజరవనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, షాలిని పసుపు కుంకుమ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దుబాయ్ లో ఏప్రిల్ నెలలో పెళ్లి అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అప్పుడు పెళ్లి వాయిదా పడింది. ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’, ‘చెక్’ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అంధాధున్’ రీమేక్, కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమాలు చేయనున్నారు.
previous post