సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు తావసి క్యాన్సర్ తో పోరాడుతూ మృతి చెందారు. మధురై లోని ప్రైవేట్ ఆస్పత్రి లో సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఇటీవల తావసి కుమారుడు తన తండ్రి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆర్థిక సాయం చేయాలని కోరాడు. ఈ క్రమంలో కోలీవుడ్ నటులు విజయ సేతుపతి, సూరి, శివకార్తికేయన్, సౌందరరాజా, శింబు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తావసి వైద్యానికి ఆర్థిక సాయం అందించారు. స్టార్స్ సాయంతో మెరుగైన వైద్యం అందించినప్పటికీ తావసి మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. 140 కి పైగా సినిమాల్లో నటించిన తావసి క్యాన్సర్ ని జయించాలని ఎందరో అభిమానులు ప్రార్థించారు. కానీ ఆ ప్రార్థనలు దేవుడు వినలేదు. ఆయనను తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లాడు. ఆయన మృతికి కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
previous post