లేడి సూపర్ స్టార్ నయనతార తన కుటుంబ సభ్యులు, ప్రియుడు విఘ్నేష్ శివన్ కలిసి ఓనం పండుగను ఘనంగా జరుపుకుంది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ కేరళలో ఓనం పండుగను జరుపుకున్న నయన్, విఘ్నేష్ ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఆ ఫొటోలను నయన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి. చెన్నై నుంచి ప్రైవేట్ జెట్లో చేరుకున్న ఈ జంట కొచ్చి విమానాశ్రయంలో నడిచి వెళుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. విరామ సమయం దొరికితే చాలు విహార యాత్రలకు బయలుదేరే ఈ ప్రేమ పక్షులు ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. డేటింగ్ బోర్ కొట్టినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటామని విఘ్నేష్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. నయన్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి గురించి స్పందించలేదు.
previous post