telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాచర్లలో బోండా ఉమ, బుద్ధాపై దాడి: ఖండించిన దేవినేని

devineni uma disappointed on utsav arrangements

మాచర్లలో టీడీపీ నాయకుల వాహనంపై దాడి ఘటనపై ఆ పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. టీడీపీ సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు దేవినేని ట్వీట్ చేశారు. అడ్డుకున్న డీఎస్పీపైనా, న్యాయవాదిపైనా వైసీపీ కిరాయి మూకలు దాడికి పాల్పడడంపై ఆయన మండిపడ్డారు.

వైఎస్ జగన్ ప్రోద్బలం లేకుండా ఈ దాడి జరిగి ఉంటుందా? అంటూ ట్విట్టర్ లో స్పందించారు. ఇవాళ గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై తీవ్రస్థాయిలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువిరుస్తున్నాయి.

Related posts