telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : ముంబైకి షాక్ ఇచ్చిన ఢిల్లీ…

ఐపీఎల్ 2021 లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టుకి ఢిల్లీ బౌలర్లు మొదట షాక్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిపి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (44) స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. కానీ ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా వరుస వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బ కొట్టాడు. దాంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. ఇక 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ఢిల్లీకి ముంబై బౌలర్ జయంత్ యాదవ్ షాక్ ఇచ్చాడు. రెండో ఓవర్లోనే ఓపెనర్ పృథ్వీ షా ను ఒక్క పరుగుకే పెవిలియన్ చేర్చాడు. కానీ ఢిల్లీ మరో ఓపెనర్ ధావన్(45), ఆసీస్ స్టార్ ఆటగాడు స్మిత్(33) తో కలిసి జట్టును గెలుపు దగ్గరకు చేర్చాడే. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు ఔట్ అయ్యే సమయానికి లక్ష్యం చిన్నది కావడంతో తర్వాత వచ్చిన ఢిల్లీ బ్యాట్స్మెన్స్ లలిత్ యాదవ్(22), హెట్మెయర్(14) జట్టును విజయతీరాలు దాటించారు.

Related posts