telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా పరీక్షలపై కేంద్రానికి తప్పుడు సమాచారం: చంద్రబాబు

chandrababu

కరోనా పరీక్షలపై ఏప్రీ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం అందిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగాలు చెబుతున్న లెక్కలకు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలకు తేడాలున్నాయని ఆరోపించారు. కరోనా పరీక్షలను బూటకంగా మార్చారని మండిపడ్డారు.

కరోనా కేసులపై ప్రభుత్వ హెల్త్ బులెటిన్లను బోగస్ అంకెలతో నింపేస్తున్నారని విమర్శించారు.సీఎం డ్యాష్ బోర్డు అంకెలకు, ఆరోగ్యశాఖ కార్యదర్శి లెక్కలకు పొంతనలేదన్నారు. మొన్న సాయంత్రం 11,613 శాంపిల్స్ పరీక్ష చేసినట్టు డ్యాష్ బోర్టులో పేర్కొన్నారని, నిన్న ఉదయానికి 20,235 పరీక్షలు చేసినట్టు చూపించారని చంద్రబాబు ఆరోపించారు. 12 గంటల వ్యవధిలో 8,622 పరీక్షలు ఎలా చేశారని ప్రశ్నించారు.

Related posts