బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ జగన్ శక్తి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ “మిషన్ మంగళ్” అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇస్రో చేపట్టిన మిషన్ మంగళ్ యాన్ ప్రయోగం ఆధారంగా రూపొందిన “మిషన్ మంగళ్” చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాతోనే జగన్ శక్తి బాలీవుడ్కి దర్శకుడిగా పరిచయమయ్యాడు. అయితే ఆయన ఇటీవల ఓ ఫంక్షన్కి వెళ్ళగా అస్వస్థతకి గురయ్యారు. దీంతో వెంటనే ముంబైలోని ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకోగా, మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతుండగా, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్స్ స్పష్టం చేశారు. అయితే జగన్ వైద్యానికి కావలసిన ఖర్చులన్నీ అక్షయ్ చూసుకుంటుండడం ఆయన మంచి మనసుకి నిదర్శనం అని జగన్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్షయ్ రిల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా. ప్రస్తుతం అక్షయ్ కుమార్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
previous post
next post
పవన్, లోకేష్ ఓడిపోతారని ముందే తెలుసు… బండ్ల గణేష్ కామెంట్స్