telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

నివర్ ప్రభావం… సముద్రం లో అల్లకల్లోలం…

నివర్ ప్రభావం తో సముద్రం లో అల్లకల్లోలం జరుగుతుంది. తమిళనాడు లో రెండు కిలోమీటర్లు ముందుకు దూసుకొచ్చింది సముద్రం. చెన్నై మెరీనా, గోల్డెన్ బీచ్ లు మొత్తం నీటమునిగిపోయింది. అయితే నివర్ తుఫాను తీరం దాటిన విషయం తెలిసిందే. అయితే  తమిళనాడు – పుదుచ్చేరి మధ్య, బుధవారం రాత్రి 11:30 నంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తీరం దాటింది. అయితే ఆ తర్వాత అతి తీవ్ర తుఫాను తీవ్ర తుఫాను గా బలహీన పడింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. తీరందాటిన ప్రభావం నివర్ తన ప్రభావం చూపిస్తుంది. తుఫాను ప్రభావంతో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ రోజు చిత్తూరు , కర్నూలు ,ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలిన చోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు పడనున్నట్లు సమాచారం. ప్రభావిత ప్రాంత  ప్రజలు తప్పనిసరిగా వీలైనంత  వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి. ఇల్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. రైతులు అప్రమత్తంగా ఉండి , పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Related posts