telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు : కుండబద్దలు కొట్టిన ఏపీ సర్కార్

విమర్శలు, ఒత్తిళ్ళ మధ్య పరీక్షల నిర్వహణకు ముందుకు వెళుతుంది ఏపీ సర్కారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై ప్రిపరేటరీ సమావేశం నిర్వహించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఈ సందర్బంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో అధికారులు కోవిడ్ పై జాగ్రత్తలు తీసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని…ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యం అని గుర్తించాలన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇవి రద్దు కాలేదు… కొన్నిచోట్ల నిర్వహిస్తున్నారు.. మరికొన్ని చోట్ల వాయిదా వేశారని గుర్తు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు దీనిని అనవసరంగా రాద్ధాంతం చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని చురకలు అంటించారు. ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షలు ఇప్పటికే పూర్తి చేసినందుకు అధికారులకు అభినందనలు అని… 5 నుంచి 23 వరకు జరిగే పరీక్షలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. అన్ని సెంటర్ లపై నిఘా ఉంచి ప్రతి రోజు నేను కూడా సమీక్షిస్తా…విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధవంతంగా అమలు చేసెందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు.

Related posts