telugu navyamedia
క్రీడలు వార్తలు

కరోనా బారిన పడిన ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్…

ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 భారత్ లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఈ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరిగింది. అయితే ఈ టోర్నీ ఆరంభంలో చెన్నై జట్టులో కరోనా కలకలం రేపిన ఆ తర్వాత ఎటువంటి సమస్య లేకుండా సాగింది. అయితే ఈ టోర్నీ ముగిసిన తర్వాత తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచనే కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా థానే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన పోస్ట్ ”నాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని మీకు తెలపడం నా కర్తవ్యం. అయితే గత బుధవారం నుండి నాకు ఒళ్ళు నొప్పులు పార్రంభమయ్యాయి . అయితే నా ఆరోగ్యం ఇప్పుడు కొంచెం మెరుగుపడుతోంది. అన్నీ సరిగ్గా జరిగితే నేను తిరిగి మైదానంలోకి వస్తారు. మీ ప్రార్థనలలో నన్ను ఉంచండి “అని లామిచనే  పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే లామిచనే తన దేశం కోసం మొత్తం 21 టీ 20 లు, 10 వన్డేలో ఆడి మొత్తం అంతర్జాతీయ క్రికెట్‌లో 57 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. అయితే లామిచనే కేవలం ఐపీఎల్ లో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా క్రికెటబోర్డు నిర్వహిస్తున్న బిబిఎల్ లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Related posts