telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

President of India Ramnath kovind Republic day

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన రెండు బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు.రాష్ట్రంలో ఓడ రేవుల సత్వరాభివృద్ధి, ఏపీ సముద్ర తీరప్రాంత బోర్డు బిల్లు-2018ను రాష్ట్రపతి ఆమోదించారు. అలాగేఆంధ్రప్రదేశ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు- 2018ను కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

తీవ్ర అపరాధం కేసుల్లో బెయిల్‌ పొందిన వ్యక్తిని న్యాయస్థానం నిర్ణయించిన తేదీన హాజరు పర్చడంలో హామీదారుడు విఫలమైన సందర్భాల్లో జరిమానా విధించేలా ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రథమ కార్యదర్శి ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి ఎం.విజయరాజుకు లేఖ రాశారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ జారీ చేసిన ప్రతులను ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాష్‌ మీడియాకు విడుదల చేశారు.

Related posts