telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..  రూ.2 లక్షలు స్వాధీనం 

SIT Investigation YS viveka Murder
తెలంగాణలో  గుట్టుచప్పుడు కాకుండా కొనరు క్రికెట్  బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.  పెద్దమొత్తంలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. మహబూబాబాద్ పట్టణంలో 8 మంది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. 
వారి వద్ద నుంచి 2 లక్షల, 9 వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 8 సెల్‌ఫోన్‌లను కూడా బెట్టింగ్ ముఠా నుంచి జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి కలెక్ట్ చేసుకున్నారు.క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తాజా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పట్టణంలో ఇంకెన్ని ముఠాలు  ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు.

Related posts