తెలంగాణలో గుట్టుచప్పుడు కాకుండా కొనరు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. పెద్దమొత్తంలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. మహబూబాబాద్ పట్టణంలో 8 మంది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి 2 లక్షల, 9 వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 8 సెల్ఫోన్లను కూడా బెట్టింగ్ ముఠా నుంచి జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి కలెక్ట్ చేసుకున్నారు.క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తాజా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పట్టణంలో ఇంకెన్ని ముఠాలు ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు.