తెలంగాణ వెటర్నరీ డాక్టర్ అమానుష ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ నాయకులందరూ స్పందించడమే కాకుండా.. ఆ నలుగురికి కఠిన శిక్షలు పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ప్రియాంక కేసు విషయంలో సీపీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా న్యాయం కోసం ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిర్భయ, అభయ పేర్లలాగా ప్రియాంకారెడ్డికి కూడా ఒక పేరు పెట్టాలని నిర్ణయించారు. బాధితురాలి పేరు బయట పెట్టొద్దని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇక ఈ విషయంపై ఆమె కుటుంబసభ్యులతో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.