telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అలాంటప్పుడు తిరుమలకు వెళ్లడం ఎందుకు: నక్కా ఆనందబాబు

nakka anand on tdp party with nri's

ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో టీడీపీ పార్టీ నేత నక్కా ఆనందబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల వెంకన్న వద్దకు ముఖ్యమంత్రి జగన్ వెళ్తున్నారని విమర్శించారు. తద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.

వెంకన్నపై నమ్మకం ఉందని సంతకం పెట్టడం ఇష్టం లేనప్పుడు తిరుమలకు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీపై అవినీతి బురద చల్లేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని అన్నారు.

మనీలాండరింగ్, క్విడ్ ప్రోకో, ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి పదాలను జనాలకు పరిచయం చేసింది జగన్, విజయసాయిరెడ్డేనని విమర్శించారు.ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు నారా లోకేశ్ మంత్రిగానే లేరని చెప్పారు. అలాంటప్పుడు రూ. 2 వేల కోట్ల అవినీతిని ఆయన ఎలా చేస్తారని ఆనందబాబు దుయ్యబట్టారు.

Related posts