telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో నేడు కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు

karona virus

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపాకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఆదివారం కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 417కి చేరాయి.

విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి పాజిటివ్‌గా తేలినట్లు నిర్ధారించారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 12 మందికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లిన వారిలో 199 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. వారిద్వారా 161 మందికి కరోనా సోకిందని చెబుతున్నారు. ఇతరత్రా మార్గాల వల్ల 32 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.

Related posts