telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా బాధితుల విషయంలో.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

Corona

కరోనా భారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. కరోనా రోగులు తమ బంధుమిత్రులతో మాట్లాడడం ద్వారా ఎంతో ఊరట పొందుతారని తెల్లిపిండి. వారికి ఆ సౌకర్యం కల్పించేందుకు వీలుగా కరోనా రోగులు స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేందుకు రాష్ట్రాలు అనుమతి ఇవ్వాలని కేంద్రం సూచించింది. రోగులు ఇతరులతో మాట్లాడడం వల్ల స్వాంతన పొందుతారని వివరించింది.

స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లను క్రిమిరహితం చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. రోగుల మానసిక ఆరోగ్యం కూడా ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది.

Related posts