హీరో విజయ్ దేవరకొండ శనివారం డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు ఫేస్ మాస్కులు, సేఫ్టీ గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్తో పాటు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శంకర్ పాల్గొన్నారు. హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ కార్యాలయానికి చేరుకున్న విజయ్ కాసేపు ఆయనతో ముచ్చటించారు. పోరాటంలో పోలీసులు చేస్తున్న విశేష కృషి, సేవకి విజయ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో లాక్డౌన్ స్ట్రాంగ్గా అమలవుతోంది. నేను బయటి ప్రపంచాన్ని చూసి 20 రోజులు అవుతోంది. లాక్డౌన్ వల్లే ఈ రోజు పరిస్థితి అదుపులో ఉంది. ఈ విషయంలో పోలీసుల పాత్ర గొప్పది. ఇంట్లో లాక్డౌన్ పాటిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. లాక్డౌన్ పాటించని వారు దయచేసి పాటించాలి’అని విజ్ఞప్తి చేశారు.
previous post
టాప్ లెస్ ఫోజు మీకు నచ్చిందా… కొత్తగా ఉంటుందని ట్రై చేశా…