“శతమానం భవతి” వంటి హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అందించిన డైరెక్టర్ సతీష్ వేగేష్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. శివలెంక కృష్ణ ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాలో మెహరీన్ను హీరోయిన్గా తీసుకున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ సినిమా కూడా దర్శకుడి గత చిత్రాల మాదిరిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే ఉండబోతున్నట్టు సమాచారం. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
next post